Tuesday, December 2, 2008

అయిపొయింది.. ముంబైని గడగడలాడించిన ఉగ్రవాదులను మన వీరులైన సైనికులు, పోలీసులు మట్టుపెట్టారు . ఈ పోరాటంలో తమ ప్రాణాలను సైతం లెక్క చెయకుండా పోరాడి మన కోసం తమ ప్రాణాలు త్యజించిన వీరులకు మనం తప్పక నివాళులు అర్పించాల్సిన సమయం ఇది. జోహార్లు వీర సైనికులారా …. జోహార్ ! ఐతే మనం అందరము ఇక్కడ గుర్తుంచుకొవలసిన విషయం ఒకటి ఉంది … గూడచారి విభాగాల వైఫల్యాల సంగతి పక్కన పెడితే సాధారణ పౌరులుగా మన బాద్యతలను సైతం మనం అప్పుడప్పుడూ విస్మరిస్తున్నామేమో అనే అనుమానం నాకే కాదు సమాజం గురించి అలోచించే ప్రతి ఒక్కరికీ రాక మానదు . మనం మన చుట్టూ అనుమానాస్పదంగా కనపడే వాటి గురించి ఏ మాత్రం శ్రధ్ధ చూపిస్తున్నాము ? వాటి గురించి ఎప్పుడైనా పోలిసులకు సమాచారం అందించామా ? ఎవరికి వారు మనకు సంబందించినది కాదులే అని ఊరుకొబట్టే ఇవాళ రౌడీలూ, గూండాలు, ఉగ్రవాదులు విచ్చలవిడిగా సమాజంలో తిరుగుతున్నారు . మనం సమాజం పట్ల మన బాద్యతను సరిగా నెరవేరిస్తే , ఇలాంటి సంఘటనలను కొంతలొ కొంత నివారించగలము . ఈ పోరాటంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించటమే కాదు వారి కుటుంబాలకు మన వంతు సాయం అందించాలి. ఆప్పుడే ఇలాంటి మరికొంతమంది వీరులు మళ్ళీ మళ్ళీ సాటి వారి కోసం, సమాజం కోసం , దేశం కోసం తమ ప్రాణాలు ఒడ్డుతుంటారు . ఇక్కడ మనం కర్కరే ( ఏ టి యస్ అదికారి ) గారి భార్య ప్రవర్తించిన తీరును గుర్తు తెచ్చుకుంటే అది అనవసరమైన ప్రస్తావన అవదు . అమె గుజరాత్ సీ యం ప్రకటించిన విరాళం తిరస్కరించి మన రెండు నాల్కల రాజకీయ నాయకుల ముఖాన చెళ్ళున కొట్టినట్టు ఉండే పని చేసింది . అలాంటి స్వాభిమానులకు మనం ఆసరాగా నిలవాల్సిన తరుణం ఇది . మానసికం గాను ఆర్దికంగానూ వారికి మనం వారికి తోదుగా నిలిచి మన బాద్యత నెరవేర్చాలి.నా వంతుగా నేను వారికోసం రూ. 2000/- విరాళాన్ని ప్రధానమంత్రి సహాయనిధి కి జమ చేస్తున్నాను . మరి మీరు మీ వంతుగా ఏం చెయగలరో చూడండి. జై హింద్ .

Saturday, November 29, 2008

ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి

కొన్ని ప్రశ్నలకు జవాబులు ఉండవేమో?! తప్పని తెలిసీ ధర్మరాజు పదే పదే జూదం ఎందుకు ఆడాడు ? సభ్యత కాదని తెలిసీ పాంచాలి దుర్యొధనుడిని చూసి ఎందుకు నవ్వింది ? రాముడిని అడవికి పంపమని కైక ఎందుకు కోరింది ? భారతం వ్యాసుడే ఎందుకు రాసాడు ? వాల్మికి రామాయణం ఎందుకు రాసాడు ? తమిళం ప్రాచీన భాషగా గుర్తించబడేదాక మన వాళ్ళు ఎందుకు ఆ ప్రయత్నం చేయలెదు ? ఎప్పుడూ మన సినిమాలలో బ్రాహ్మణులనే ఎందుకు బఫూన్లలా చూపిస్తారు ? విఙానం ఎంత పెరిగినా మనిషి ఇంకా బాణామతి లాంటివి నమ్ముతూ అమాయకులను అనుమానంతొ చంపుతారు ? ఎందుకు అమ్మాయిలు ప్రేమ నటించేవారి నే నమ్ముతారు ? ఎందుకు “నెను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎవరికైనా చెప్పాలంటే నొరు పెగలదు” ? ఎందుకు సూర్యుడు ఎప్పుడూ తూర్పునే ఉదయిస్తాడు ? తెల్లవారుజామున తొలికోడి కూసాకే తెల్లారింది అని ఎందుకు అనుకుంటాము ? ఎందుకు మనం నిత్యం ఒక శక్తి వచ్చి మనలను కాపాడాలని చూస్తాము ? మన శక్తిని మనం ఎందుకు నమ్ముకోము ? ఎందుకు ఆరు లేన్లు ఉన్న మన హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ రద్దీ తగ్గదు ? ఎందుకు మనం అరటి కాయలు తిని తొక్కలు రోడ్డు మధ్యలో పడేస్తాము ? ఎందుకు మనం సమాజం మన ఉమ్మడి కుటుంబం లాంటిది అని భావించము ? ఎందుకు మన శరీరంలోని నరాలు మన ఎదురుగా ఉన్న చెడుని ఎదిరించలేవు ? ఎందుకు మన ఒంట్లోని రక్తం చెడుని చూస్తె సలసలా మరిగిపోదు ? ఎందుకు మనము కనుల ఎదుట జరిగే అన్యాయాన్ని ఖండించలేకున్నాము ? ఎన్ని నీతులు చెప్పినా మన ఇంట్లో పనికి చిన్న పిల్లలను పెట్టుకొవటం ఎందుకు మానము ? ఎందుకు పిల్లలతో కలిసి ఏదైనా సినిమాకి వెళ్ళలంటే భయపడుతున్నాము ? ఎందుకు భూముల దరలు ఆకాశాన్ని తాకాయి ? ఎందుకు ఇంకా సగం జనాభా మురికివాదలలో నివసిస్తున్నది ? ఎందుకు ఇంకా పిల్లలలో పౌష్తికాహర లొపంతొ చావులు ఆగటం లేదు ? ఎందుకు మనం ఎంత సంపాదించిన కనీసం ఒక్క అనాద పిల్లాడి ఒక్క నెల స్కూల్ ఫీజు కట్టాలంటే అదేదో బ్రహ్మ కార్యంలా అనుకుంటామెందుకు ? ఎందుకు నేను ఇలా గమ్యం దొరకని ప్రశ్నలతో ఈ బ్లాగుని నింపుతున్నాను ?
- జవాబులు దొరికే అవకాశం ఉంది - తెలుసు ! అంతే కాదు అసలు ఈ ప్రశ్నలు మళ్ళీ ఎవరూ వేసే అవకాశం రానీయకుండానూ చేయవచ్చు. కానీ మనలో ఎంత మందిమి ఈ ప్రశ్నలకు జవాబు చెప్తాము, కొన్ని సమస్యలకు మనమే కారణం అన్నది తెలుసుకుని వాటిని నివారించడం చేస్తాము ?
సమాజంలోని పెద్ద సమస్యలు, వాటి మూలాలు, నివరణ మార్గాలు, ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నీ మరిచిపోండి ... నెను ఒక పని చెప్తాను చేయండి. అది ఏమిటి అంటారా ......
ఇవన్నీ మరిచిపోండి, ఒక్క మొక్క మీ పెరట్లో నాటండి – రోజూ దానికి నీళ్ళు పోయండి – అది పెరిగి మీ ఇంటికి నీడని గాని లేదా మీ పిల్లలకి పండ్లు గాని ఇచ్చేటట్టు చూడండి - వాటిని పక్కింటి పిల్లలతో కలిసి పంచుకోమని మీ పిల్లలకు నేర్పండి .. అది నీడైనా లెక పండ్లు ఐనా. సమాజానికి మీ వంతు మేలు చేసిన వారిలో ఒకరు అవుతారు.

జై భారత్!!!!

వందేమాతరం!

Wednesday, November 26, 2008

సరదాకి

సాయంకాలం ఆరు గంటల సమయం అవుతోంది. పార్కులో కూర్చున్న ఆ అమ్మాయి మాటిమాటికీ అసహనంగా వాచీ చూసుకుంటూ ఉంది . చూడటానికి బాపు బొమ్మలా చాలా అందంగా ఉంది . ఒంటి మీది బంగారం ధధగలు చూస్తుంటే బాగ డబ్బున్న వాళ్ళ కూతురి లా కనిపిస్తుంది . చూదబొతే తన ప్రియుడి కోసమని పార్కు లొ నిరీక్షణ అనుకుంట అతని ఆలస్యానికి కాబోలు ప్రపంచంలోని చిరాకును అంతా తన ముఖంలోనే పెట్టినట్టు ఉంది . కాసేపటికి తనలొ తను ఏదో అనుకుంటూ ఆ అమ్మయి లేచి వడివడిగా బయటికి అదుగులు వేయసాగింది . అప్పటిదాక ఆమెనే గమనిస్తున్న ఒక హీరొ లేచి ఆమెను అనుసరించాదు . మన హీరొ పార్కు బయటికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి తన స్కూటీ తీస్తూ కనపడింది . మన హీరో కూడా తన హీరో హోండా కోసం పరుగుతీసాడు . కట్ చేస్తే నెక్లెస్ రోడ్డు మీద ఇద్దరి వాహనాలు మెల్లిగా పరుగులు పెడుతున్నాయి . ఆ అమ్మాయి స్కూటీకి పక్కనే తన హోండాను నెమ్మదిగా నదుపుతూ రేర్ వ్యూ మిర్రర్ను ఆమె కనపడేలా సరి చేసాడు . మొదట పట్టించుకోలేదు కాని తను ఎంత నెమ్మదిగా వెళుతున్నా బైక్ తనను దాటకపొయెసరికి ఆమెకు విషయం అర్థమయింది . అయినా ఆపకుందా అతన్ని అప్పుడప్పుడూ గమనిస్తూ వెళ్ళసాగింది . అతనికి కూడ అమె తనను గమనించిందని అర్థమై నవ్వుకున్నాడు . అతనికి కావలిసింది కూడా అదే కదా మరి. బైకుని చేతులు వదిలేసి అద్దాలు తీసి మల్లి పెట్టుకొవటం ఇలాంటి పనులు చేస్తూ అమె ద్రుష్టిని మరింతగా ఆకర్షించాడు . చివరికి వాళ్ళ ప్రయాణం ఒక సినిమా థియేటర్ వద్ద ముగిసింది . ఆమె వెళ్ళి ఒక టికెట్ తీసుకుంది అమ వెనుకే హీరో కూడ . ఆ అమ్మాయి వెల్లి వెయిటింగ్ లాంజ్ లొ కూర్చుంది . ఒక రెందు నిమిషాల పాటు మన హీరో ఇప్పుడు ఏం చేయాలా అని దీర్ఘంగా అలోచించాడు . ఏదో మంచి అలోచన వచ్చినట్టు నవ్వుకుంటూ వెళ్ళి రెందు కూల్ డ్రింక్ సీసాలు తీసుకుని ఆ అమ్మాయి వద్దకు వెళ్ళి ఎదురుగా నిలబడ్డదు . ఆ అమ్మాయి తలెత్తి అతని వంక ఎమిటి అన్నట్టు ఒక ప్రశ్నార్థకమైన చూపు విసిరింది . “మీరు ఎమీ అనుకోనంటే” అంటూ ఒక సీసా అమె వైపు చాపాదు . “ మీరు ఎవరొ నాకు తెలీదు . . . . “ ఇంకా ఏదో అనబొతున్న ఆమెతో “ నా పేరు రాజు నెను సాప్ట్ వేర్ ఇంజనీర్ని సత్యం లో చేస్తున్నాను అడ్రెస్…. “ ఆపకుండా చెపుతున్న అతనికి అడ్డు తగిలి “ మీ పరిచయం కన్నా డ్రింకే బెతర్ “ అంటూ సీసా ని అందుకుంది . నవ్వుతూ అమె పక్క కుర్చీలో కూర్చుని “ మీరు చాల బాగున్నారు “ అన్నాడు. “తెలుసు అప్పటినుండీ నా వెనుకే వస్తుంటే ఆ మాత్రం అర్థం కాదా “ . “ మీరు ఎం చేస్తుంటారు “ అడిగాడు “ బి టెక్ లాస్టియర్ “ అంటూ అతని వంక దీర్ఘంగా చూసింది . గోదుమ రంగు చొక్కా నల్ల పాంటు లొకి ఇన్ చెసి ఉన్నాడు . మంచి ఫిజిక్ ఉన్నట్టుంది చొక్కా వెసుకున్నా కూడా అతని కండలు మెలితిరిగి కనపడుతున్నాయి . ఎర్రగా బుర్రగా ఉన్నాడు అనుకుంటున్న అమె అలోచనలను భగ్నం చేస్తూ “ ఎమిటి అలా చూస్తున్నారు “ అని అడిగేసరికి ఈ లోకం లొకి వచ్చి సిగ్గుపడింది . మీ పేరు అడుగుతున్నాను అండి – మళ్ళీ అడిగాడు “ శ్రావ్య” (తియ్యగా ఉంది అమ్మాయి పేరు గొంతు) అబ్బాయి మనసులొ అనుకున్నాడు . ఇంతలొ గంట మోగటంతో లేచి థియెటర్లొకి నడిచారు . పక్కపక్క సీట్లలో కూర్చున్నారు . సినిమా మొదలయింది . ఈ మధ్యే విడుదలైన అతి చెత్త సినిమాలలో ఒకటి అది . “ ఈ సినిమానా “ ఇద్దరూ ఒకేసారి పైకి గట్టిగా అన్నారు . అని ఒకరి వంక ఒకరు చూసుకుని నవ్వుకున్నారు . నవ్వటం ఆపి “ నా లాగే మీరూ పోష్టరు కూడా చూడకుండా వచ్చారు కదూ “ అదిగాడు రాజు . అవునన్నట్టు తలూపింది శ్రావ్య . తర్వాత తప్పదు అన్నట్టు సినిమా చూస్తూ ఉండిపొయారు . కాసేపటి తర్వాత మెల్లిగా అమె చేతి మీద తన చేయి వేసాడు . శ్రావ్య అది గమనించిన కూడా ఎమీ అనలెదు కానీ తన చెయి తీసుకొవటానికి చిన్న ప్రయత్నం చేసింది , ఏదొ అలా చెయ్యకపోథే పలుచన అవుతాననే గాని అమెకు కూడ అతని స్పర్శ నచ్చింది . అలా ఎలాగొ ఇంటర్వల్ వరకూ భారంగా చిన్న చిన్న స్పర్శలు కనుల మూగ బాసలు పంచుకుంటూ గడిపారు . ఇంటర్వెల్ అయ్యాక అమె చెవి వద్దకు చేరి “ వెల్దాం పద “ అన్నాడు “ఎక్కడికి “ లో స్వరంలో అడిగింది . “ కాస్త రొమాంటిక్ గా ఉండె చోటికి “ అన్నాడు . కొద్ది సేపు బెట్టు చేసి బతిమిలాడించుకుని లెచింది . ఈద్దరూ బయటికి వెళ్ళాక “ నీ బైకు తీసుకురా ఇద్దరం కలిసి వెల్దాము “ అన్నది శ్రావ్య . సరేనంటూ వెళ్ళి హోండాని తీసుకుని వచ్చాడు . అమె అతని బండి వెనుక ఎక్కి అతని నదుము చుట్టూ చేతులు వేసింది . “ మరి నీ స్కూటీ “ అడిగాడు రాజు . “ జానె దో భి యార్ రేపు చూసుకుందాము “ మరింత గట్టిగా హత్తుకుంది అతన్ని . అంతే అతని బండి 5 సెకన్లలొ 80 కిలొమీటర్ల వేగం అందుకుంది . పది నిమిషాలలో ఒక మంచి రెస్తారెంట్ ముందు బండిని ఆపాడు . ఇద్దరూ ఒకరి కళ్ళలొకి ఒకరు చూసుకుంటూ కాండిల్ లైట్ డిన్నర్ చేసారు . బిల్లు కట్టటానికి నేనంటే నేను అని పోటీ పడి చివరికి ఇద్దరూ కలిసి చెరి సగం కట్టి బయటికి వచ్చారు . “ఇప్పుడు ఎక్కడికి వెల్దాం “ అడిగాడు . “ మా ఇంటికి “ అతని జుట్టు చెరుపుతూ చెప్పింది “ అప్పుడేనా “ గారంగా అడిగాదు రాజు .” రేపు మళ్ళీ ఉంది కదా “ అంటూ అతన్ని సముదాయించింది . సరేనంటూ బండి తీసాడు . అమె దారి చెపుతుంటే మెల్లిగా నడుపుతున్నాడు . గల్లీలలొనుండి వెల్తుంటే హటాత్తుగా బండి ని ఆపమని అరిచింది బండిని ఆపి ఎమయింది అని అడిగాడు . “నా పర్సు పడిపొయింది” చెప్పిందామె . దిగి బండికి స్టాందు వేసి వెళ్ళి వెతకటం మొదలు పెట్టాడు . బండి దగ్గర నిలబడ్డ శ్రావ్య చుట్టూ ఒకసారి చూసింది . ఎవరూ లేరని ఖాయం చెసుకున్నాక మెల్లిగా రాజు వెనుకకి చెరి “హాండ్సప్ “ అంది . ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన రాజుకు శ్రావ్య చేతిలొ తుపాకి కనపడింది . “ఎంటిది “ అంతూ ముందుకు కదలబోయాడు .ఆగు అన్నట్టు పిస్టల్ని బెదిరింపుగా ఊపి “ తియ్యి బయటికి “ అన్నది ఆమె . ఏం తియ్యాలి అనబొయి ఆగిపొయాడు . అమె అభిసారిక కాదు తన జేబులొనూ ఒంటి మీదా ఉన్న సంపదనూ చుట్ట చుట్టుకుపొవతానికి వచ్చిన వయ్యారి దొంగ అని అర్థమై తనని తాను తిట్టుకున్నాడు . 5 నిమిషాల తర్వాత ఖాళీ జెబులు, బోసి మెడతో రోడ్డు మీద నిలబడ్డాడు రాజు . “ ఛ ఇది స్కూటీని అక్కడ వదిలేసి వచ్చినప్పుడే అనుమనించాలిసింది “ అనుకునంటూ “ ఐనా ముందు జాగ్రత్త ఉండాలి కాని చేతులు కాలాక ఎన్ని అనుకుంటే ఎం లాభం – అనుకుంటూ రోడ్డుకు రెండు వైపులా చూసాడు . ఎవరో బండి మీద వస్తూ కనబడ్డారు “ అమ్మయ్య కనీసం కాలిన చేతులకు అయింటుమెంటన్నా రాసుకుందాం “ అనుకుంటూ సాక్సు లొ నుండి కత్తి తీసుకుని బండి మీద వస్తున్న వ్యక్తికి అడ్డం వెళ్ళాడు.

Tuesday, November 25, 2008

ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న పథకాలు తక్షన ప్రయోజనాల ద్రుష్ట్యా చూస్తే అద్భుతమైనవే కాదనలేము. ఈ పథకాల అమలుతో కొన్ని వందల మంది లేదా వేల మంది లాభపడుతున్నారు .కాని ఈ లాభం ప్రజలకు దీర్గకాలానికా లేక స్వల్పకాలానికా ? తరచి చూస్తె ఈ పధకాలతో జరిగే లాభం తాటాకు మంట లాంటిది అని అనిపిస్తుంది . ఒక ఉదాహరణ : ఆరొగ్యశ్రీ – చాల మంచి పథకం. దీని ద్వారా ఎంతొ మంది పేద ప్రజలు తమ కలలొ సైతం ఊహించని వైద్య సదుపాయాలను ,అత్యంత ఖరీదైన శస్త్రచికిత్స సేవలను ఉచితంగా పొందగలరు. ఈ వ్యాసం రాసే సమయనికే ఈ పథకం వల్ల లాభపదిన వారి సంఖ్య వేలను దాటింది.ఈ పథకం పరిధి లొకి రాని వ్యాదులు, చికిత్సలు వీటి జొలికి మనం వెళ్లొద్దు. ఐతే మనం గమనించవలసిన విషయం ఏమిటంటె ఈ పదకం వల్ల అనారొగ్యం పోదు కేవలం చికిత్స.. కొన్నిసార్లు సమయానికి మరికొన్నిసార్లు ఆలస్యంగానో అందే అవకాశం మాత్రమే ఉంది. ఈ పదకానికి అయ్యే ఖర్చులొ కొంత భాగాన్నైనా సరే పారిశుధ్య నిర్వహణకు ,మంచి పరిసరాలు తయారు చేసేందుకు, ప్రభుత్వ ఆసుపత్రుల లొ మెరుగైన సదుపాయల కల్పన కు ఉపయోగించవచ్చు . ఇటువంటి కార్యక్రమలతో అరొగ్యశ్రీ వంటి అత్యవసర సేవలు అందించే పథకాల అవసరం తగ్గుతుంది …. వెంటనే కాకపొవచ్చు కాని దీర్ఘకాలంలొ ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందికానీ ప్రభుత్వం ఎప్పటిలాగే ప్రజలు నిత్యం తమ మీదే ఆదారపడి ఉండే పరిస్థితి పోకుండా జాగ్రత్తపడుతున్నట్టు అనిపించక మానదు. ప్రభుత్వం నడిపేది ఎవరైనా అది కాంగ్రెస్ లేదా పీ ఆర్పీ లేదా టిడిపి ఎవరైనా అందరు గుర్తుంచుకోవలసిన సామెత ఒకటి ఉంది“ ఒక వ్యక్తికి ఒకరొజు చేపను దానం ఇవ్వవద్దు , అందువల్ల అతని ఒక్క పూట ఆకలి మాత్రమే తీరుతుంది . అదే అతనికి చెపలు పట్టే కళను నెర్పించండి అతను జీవితాంతం ఆకలి లేకుండా బతుకుతాడు “ ఇప్పుడు ప్రభుత్వాలు మాత్రం బద్దకస్తులను తయారు చేసే యంత్రాలుగా మారుతున్నయేమో అన్న అభిప్రాయం మాత్రం నా మనసులొ నానాటికీ బలపడుతున్నది.

Monday, November 24, 2008

ముఖ్యమంత్రి గారికి


వై యస్ రాజశెఖర రెడ్డి గారికి :గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఒక సూటి ప్రశ్న ఆర్యా మీరు తలపెట్టిన కార్యకమలు, అమలు చెసిన మరియు ప్రకటించిన పధకాలు ఒక్కటి రెండు కావు . ఐతే ఈ పధకాల ద్వార ప్రజలకు జరిగే మేలు ఎంత అన్నది కొంత మేరకు ప్రశ్న గానే ఉంటోంది. ఎందుకు అంటారా, అయ్యా మీ పధకాలు అన్నీ చాలా మంచివి అందులొ ఏ మాత్రం అనుమానం లెధు.ఐతే ఈ పధకాల ద్వార దీర్ఘకాలంలొ ప్రజలకు జరిగే మేలు ఎంటి ? వీటి సహాయం తో మనిషి స్వయం సమృద్ధి ఎలా సాధించగలడు ? అసలు సగటు మానవుని ఆర్దిక స్తితులను ఈ పధకాలు ఏ విధం ఎలమార్చగలదు ? ఈ పధకాలకు డబ్బు ఎక్కడ నుంది తెస్థారు ? ఇప్పటి వరకు అమలు చెసిన పధకాలు ఏవి ? వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి ? ఇవి కొన్ని ప్రశ్నలు మాత్రమే ! మరికొన్నిటిని కలుపుకుని రేపు మల్లీ కలుద్ధాం.శుభరాత్రి

Saturday, November 22, 2008

ఇవాళ నేను రాజకీయాల గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను . ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన చిరంజీవి రాజకీయాలలోకి రావటం గురించిన చర్చ వినబదుతూ ఉంది . చిరంజీవి రాజకీయాల లోకి రావడం అతని వ్యక్తిగత నిర్ణయం కాని ఆయన ఆ నిర్ణయం తో ప్రజలకు ఎలా సేవ చేయాలని అనుకుంటున్నారు అన్నదే ప్రశ్న . సేవ కు పదవులు అవసరం లేదు అన్నది ఆయన అభిప్రాయం అని చాలాసార్లు చెప్పటం జరిగినది. మరి ఇప్పుడు ఈ పార్టీ పెట్టడం ఎందుకు ? ఇవన్ని పక్కన పెడితే పోలేపల్లి సెజ్ బాధితులు , సిరిసిల్ల నేత కార్మికులు ఇలా ప్రాముఖ్యమైన కొన్ని సమస్యలను ఎన్నుకున్నారు ఇవి చాల ముఖ్యమైన సమస్యలు ఎవరు కాదు అనలేనివి. ఐతే వీటికి పరిష్కారం ఏంటి ?సమస్యకు మూలాలు ఏంటి ?కొత్త పార్టీకి వీటి పరిష్కారం గురించి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా ? లేక అధికారం లోకి వచ్చాక పరిష్కారం గురించి ఆలోచించవచ్చు అనేది పార్టీ నాయకత్వం యొక్క భావనా? అనేది ఇప్పుడు ప్రజల మనస్సులో ఉన్న సందేహం . ఈ సందేహాలను తీర్చేందుకు చిరంజీవి ఇంకా ఆయన పార్టీలోని ముఖ్యులు కృషి చేయవలసి ఉంది . పార్టీ అధికారం లోకి రావడానికి సరైన సమస్యలను ఎన్నుకోవడం వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది అన్న విషయాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడం సాధారణంగా ప్రతిపక్షాలు చేసే పని అన్నది జగద్విదితం .మరి చిరంజీవి పార్టీ కూడా ఇదే సూత్రాన్ని అనుసరించి అధికారం కోసం ప్రయత్నిస్తే వారికి మిగతా పార్టీలకు తేడా ఉండదు. వారి నాయకత్వం చెపుతున్న " మార్పు " కూడా ప్రస్నార్ధకమవుతుంది . ఇప్పుడు చిరంజీవి లాంటి విజ్ఞుడు చేయవలసిన పని ఏంటి అంటే తను వారికంటే భిన్నమయిన వాణ్ని అని నిరూపించుకోవాలి .అది ఎలా అంటే ఆయన తను ఎంచుకున్న సమస్యలకు తన వద్ద పరిష్కారాలు ఉన్నాయని ప్రజలకు తెలియజేయాలి . అప్పుడే ఆయన ఎన్నికలలో విజయం కోసం కాక ప్రజలకు మంచి జరగాలనే ఈ సమస్యల పై తన గళం వినిపించారని జనాలకు తెలుస్తుంది . అంతే కాని అధికారంలోకి వస్తే ఈ సమస్య పరిష్కరిస్తాను అంటే అది పదవి కోసం పాకులటగా జనం భ్రమించే అవకాశం ఉంది . ఇప్పుడు బంతి చిరంజీవి కోర్టులో ఉంది ఆయన ఇప్పుడు ఎం చేయబోతున్నారు గోల్ సాధించగలరా ?

Friday, November 21, 2008

ఒక రోజు నేను ఇలా బ్లాగ్స్ రాస్తూ ఉంటాను అనుకోలేదు .

విజయం మనకు అనాయాసంగా దొరికితే దాని విలువ తెలియదు , కష్టపడి విజయం పొందాలి కాని కష్టాన్ని ఇష్టంగా అనుకుంటేనే మనకు విజయం దక్కుతుంది.

నిన్న చెల్లని చెక్కు రేపు ప్రోమిసోరీ నోటు లాంటిది నేడు సిద్దంగా ఉన్న డబ్బు అందుకే నిన్నను వదిలేసి నేతిని వాడుకుని రేపటి విలువ పోకుండా గడపాలి. అప్పుడే మన జీవితాలకు ఒక విలువ ఔన్నత్యం ఉంటాయి

అందరు బాగుండాలి